యాప్నగరం

పశ్చిమ గోదావరి: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం

మద్యానికి బానిసైన రమేష్ నిత్యం తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అనుమానం కూడా తోడవడంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని అమానుషానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 4 Nov 2020, 1:14 pm
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు. ఈ అమానుష ఘటన జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన కుంజా రమేష్ మద్యానికి బానిసయ్యాడు. కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అదే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


అదే విషయమై దంపతుల మధ్య మరోమారు ఘర్షణ జరగడంతో రమేష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. భార్య నిద్రిస్తుండగా గీత కత్తితో గొంతుకోశాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో బాధితురాలి తండ్రి, ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

Also Read: భర్త గొంతుకోసిన భార్య ప్రియుడు.. చనిపోయాడనుకుని వెళ్లిపోయాక.. షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.