యాప్నగరం

ప్రాణం తీసిన పావురం.. కృష్ణా జిల్లాలో దారుణం

ఐస్ బండి వ్యాపారం చేసుకునే ఇర్ఫాన్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రభాకర్‌రావుతో పావురం విషయమై గొడవపడ్డాడు.

Samayam Telugu 8 Jul 2020, 6:56 pm
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పావురాల విషయంలో జరిగిన గొడవలో భర్త చనిపోగా.. భార్య తీవ్రగాయాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ అమానుష ఘటన జిల్లాలోని పెడన మండలం కట్లపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్(45) ఐస్ బండి వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం ముగించుకుని ఇంటికొచ్చిన ఇర్ఫాన్‌ పావురాల విషయమై అదే గ్రామానికి చెందిన పాలపర్తి ప్రభాకర్‌రావుతో గొడవపడ్డాడు.
Samayam Telugu ప్రాణాలు కోల్పోయిన ఇర్ఫాన్
murder


ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో రెచ్చిపోయిన ప్రభాకర్‌రావు చాకుతో ఇర్ఫాన్‌ను పొడిచేశాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఇర్ఫాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అడ్డుకోబోయిన ఇర్ఫాన్ భార్య కాజాపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: అత్తతో అల్లుడి రాసలీలలు.. మామకి తెలిసిపోవడంతో.. దారుణంAlso Read: ఎస్సై చెంప‌ పగలగొట్టిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.