యాప్నగరం

మాట్లాడాలని పిలిచి... ప్రియురాలిని గొంతు నులిమి చంపేసిన యువకుడు

రెండ్రోజుల క్రితం ప్రియురాలిని మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచిన భీష్మ అనే యువకుడు ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

Samayam Telugu 11 Jul 2020, 2:54 pm
ఐదేళ్లుగా ప్రేమిస్తున్న యువతిని క్షణికావేశంలో గొంతు నులిమి చంపేశాడో యువకుడు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలోని తెంతులికుంటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. అంచలగుమ్మ గ్రామానికి చెందిన భీష్మ హరిజన్‌(27), అదే గ్రామానికి చెందిన ధరణి అనే యువతి ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ధరణి గ్రామంలోనే కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి సాయంగా ఉంటోంది. రెండ్రోజుల క్రితం ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా భీష్మ ఫోన్ చేసి మాట్లాడుకోవాలని స్కూల్‌ దగ్గరికి రావాలని కోరాడు.
Samayam Telugu Image


Also Read: తెలంగాణలో మరో డేరాబాబా... శిష్యుడితో కలిసి భక్తురాలిపై అఘాయిత్యం

ధరణి రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. స్కూల్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన స్థానికులు ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆమె గొంతుపై చేతిగోళ్లతో గీకినట్లు గుర్తులు ఉన్నాయి. అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Also Read: హైదరాబాదీలపై సైబర్ వల.. ఒక్కరోజులో ఎన్ని కేసులో తెలుసా?

ఈ ఘటనపై ధరణి తల్లి సూర్యగోండ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు భీష్మ హరిజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐదేళ్లుగా ప్రేమిస్తున్న యువతిని అతడు ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘కోరిక తీర్చకపోతే అంతు చూస్తా’.. ఏలూరులో వివాహితకు లైంగిక వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.