యాప్నగరం

గచ్చిబౌలిలో జంట హత్యల కలకలం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు

బుధవారం భార్యతో గొడవ జరగడంతో అనంతప్ప రెచ్చిపోయాడు. ఆగ్రహంతో కత్తి తీసుకుని భార్య మాధవితో పాటు రెండేళ్ల కుమారుడిని పొడిచి చంపేశాడు. తర్వాత భయంతో తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

Samayam Telugu 11 Dec 2019, 1:31 pm
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్‌టీఆర్ నగర్‌లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్న కొడుకు(2)ని దారుణంగా నరికి చంపేశాడు. కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన అనంతప్ప కొద్దినెలల క్రితం భార్య, మాధవి, కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు.
Samayam Telugu hyde


Also Read: 40 రోజుల క్రితమే రెండో పెళ్లి.. ఉరేసుకుని మహిళా డాక్టర్ ఆత్మహత్య

గచ్చిబౌలి ప్రాంతంలోని గోపన్‌పల్లిలో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం దంపతుల మధ్య గొడవ జరగడంతో అనంతప్ప ఆగ్రహంతో రెచ్చిపోయాడు. భార్యతో పాటు రెండేళ్ల కుమారుడిని కత్తితో నరికి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో గచ్చిబౌలి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న అనంతప్ప ఆస్పత్రికి తరలించారు.

Also Read: స్పా ముసుగులో వ్యభిచారం.. 29 మంది వేశ్యలు, 30 మంది కస్టమర్ల అరెస్ట్

ప్రస్తుతం అనంతప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలతోనే అనంతప్ప ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. అనంతప్ప క్షణికావేశంతో భార్య, బిడ్డ ప్రాణం తీయడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Also Read: నెల్లూరు జిల్లాలో దారుణం.. వివాహితను గదిలోకి లాగి గ్రామ వాలంటీర్ అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.