యాప్నగరం

గుట్టల్లో శవమై తేలిన యువకుడు.. అనంతపురంలో మిస్టరీ మరణం

ఇంటి నుంచి వెళ్లిన భర్త తిరిగిరాలేదు. రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. అతనిది హత్యా? లేక ఆత్మహత్యా? యువకుడి మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 28 Oct 2020, 5:15 pm
రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా పెనుకొండలో వెలుగుచూసిన ఈ ఘటన మిస్టరీగా మారింది. కొత్తచెరువు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వడ్డే శ్రీనివాసులు(27) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. రోజూ పని కోసం పెనుగొండ వెళ్లేవాడు. గత ఆదివారం సాయంత్రం బైక్‌పై బయటికెళ్లిన శ్రీనివాసులు తిరిగిరాలేదు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


అతని జాడ కోసం వెతికిన కుటుంబ సభ్యులకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజుల అనంతరం శ్రీనివాసులు పెనుకొండ రహదారిలో బండ్లపల్లి సమీపాన గుడ్డిబావి వద్ద శవమై కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని శ్రీనివాసులుగా గుర్తించారు.

Also Read: మాట్లాడుకుందామని పిలిచి మర్డర్.. ప్రకాశంలో దారుణం

రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన శ్రీనివాసులు శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? లేక మరేదైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో బావిలోకి.! వరంగల్ జీపు ప్రమాదంలో షాకింగ్ నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.