యాప్నగరం

అన్నవరం లాడ్జిలో మృతదేహం.. తూర్పు గోదావరిలో మిస్టరీ

రాత్రి సమయంలో ముగ్గురు కలిసి రూమ్ తీసుకున్నారు. తెల్లవారుజామున ముగ్గురిలో ఒకరు చనిపోగా.. ఇద్దరు కనిపించకుండా పోయారు.

Samayam Telugu 27 Sep 2020, 2:17 pm
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అన్నవరంలోని సత్యదేవ హైస్కూలు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. లాడ్జిలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులు బస చేసినట్లు సమాచారం. తెల్లవారేసరికి ఇద్దరు వ్యక్తులు లాడ్జిలో కనిపించలేదు. మరో వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించిన లాడ్జి ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అన్నవరం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జి యజమానిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read: కూతురి ప్రేమ రేపిన చిచ్చు.. నేటికీ ఆగని నరమేధం.. పెట్రోల్ బాంబులేసి ప్రియుడి తల్లి హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.