యాప్నగరం

అమరావతిలో జంట హత్యలు.. ఆకాశరామన్న లేఖతో వీడిన మిస్టరీ

కొద్దిరోజుల తర్వాత రామకోటేశ్వరరావుకు, ఉల్లయ్యకు స్థలం వివాదం తలెత్తింది. దీంతో రామకోటేశ్వరరావును ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో గాయత్రి హత్య విషయాన్ని చావలి ఉల్లయ్య అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు ఆకాశరామన్న ఉత్తరం రాశాడు.

Samayam Telugu 18 Dec 2019, 11:06 am
అమరావతి పరిధిలోని మంగళగిరిలో రెండున్నరేళ్ల క్రితం క్రితం అదృశ్యమైన వివాహిత కేసును పోలీసులు చేధించారు. గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు అందిన ఆకాశరామన్న లేఖతో కేసు కీలక తీసుకుంది. రెండున్నరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన గాయత్రి అనే మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Samayam Telugu amara


Also Read: తాగిన మైకంలో పోలీసులపై దాడి.. సెక్సీనటి బాబిలోనా తమ్ముడు అరెస్ట్

సీఐ శేషగిరిరావు కథనం ప్రకారం.. మంగళగిరి పట్టణం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గాయత్రితో ఎర్రబాలెం గ్రామానికి చెందిన చిమటా రామకోటేశ్వరరావు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను అందరికీ రెండో భార్యగా చెబుతూ ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. కొంతకాలం తర్వాత గాయత్రి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రామకోటేశ్వరరావు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 2017 మార్చి 30వ తేదీన కర్రతో గాయత్రి తలపై కొట్టి చంపేశాడు. తన స్నేహితుడు చావలి ఉల్లయ్య సలహాతో గడదాసు సుబ్బారావు అనే వ్యక్తి సాయంతో గాయత్రి మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి రేపల్లె సమీపంలోని పెనుమూడి వంతెన వద్ద ముళ్ల పొదలో పడేశారు.

Also Read: చటాన్‌పల్లి కిడ్నాప్ కథ సుఖాంతం... షాకింగ్ విషయం చెప్పిన కిడ్నాపర్

అయితే ఈ హత్య విషయం బయటకు చెబుతాడన్న ఆందోళనతో సుబ్బారావును కూడా రామకోటేశ్వరరావు చంపేశాడు. ఈ విషయాన్ని కూడా నిందితుడు చావలి ఉల్లయ్యకు చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత రామకోటేశ్వరరావుకు, ఉల్లయ్యకు స్థలం వివాదం తలెత్తింది. దీంతో రామకోటేశ్వరరావును ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో గాయత్రి హత్య విషయాన్ని చావలి ఉల్లయ్య అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. దీంతో ఎస్పీ కింది సిబ్బందిని అప్రమత్తం చేసి దర్యాప్తునకు ఆదేశించారు. డీఎస్పీ దుర్గాప్రసాద్‌ నేతృత్వంలో పట్టణ ఇన్‌ఛార్జి సీఐ పి.శేషగిరిరావు, హెడ్‌కానిస్టేబుల్‌ శాంతకుమార్‌, సాంబశివరావు, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్‌, శ్రీనివాసరావులతో కూడిన ప్రత్యేక బృందం సమగ్ర దర్యా్ప్తు చేసి కీలక ఆధారాలు సేకరించింది. దీంతో ఈ రెండు హత్యలకు సంబంధించి రామకోటేశ్వరరావు, చావలి ఉల్లయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ‘దిశ’లాగే.. 9 మంది మహిళలను.. నిందితుల గురించి విస్మయకర వాస్తవాలు వెల్లడించిన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.