యాప్నగరం

మద్యం మత్తులో భార్య హత్య.. చూసిందని కూతురి గొంతు నులిమేశాడు

అప్పుల పాలైన ఆర్థికంగా చితికిపోయిన వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు. ఆదివారం జరిగిన గొడవలో క్షణికావేశానికి గురైన భార్య, కూతురిని గొంతు నులిమి చంపేశాడు.

Samayam Telugu 29 Jun 2020, 10:12 am
తాగుడుకు బానిసైన వ్యక్తి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనను చూసిందని కన్న కూతురిని కూడా గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో ఉర్సు గుట్ట ప్రాంతంలో ఆదివారం జరిగింది. వరంగల్ బీఆర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లుకు పదేళ్ల క్రితం రమ్య(29) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. వ్యాపారాల పేరుతో అందరి దగ్గర అప్పులు చేసిన వెంకటేశ్వర్లుకు ఆర్థికంగా చితికిపోయాడు. తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో పనికి చేరాడు.
Samayam Telugu కూతురితో రమ్య(File Photo)


Also Read: మహిళపై మంత్రగాడి అత్యాచారం.. భర్తే దగ్గరుండి మరీ గదిలోకి పంపి

ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన అతడు రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేశాడు. దీంతో రమ్య కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై తాను బుద్ధిగా ఉంటానని భార్యకు నచ్చజెప్పిన వెంకటేశ్వర్లు ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో మరోసారి భార్యతో గొడవపడిన అతడు.. క్షణికావేశంలో రమ్య గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణాన్ని చూసిన కూతురు మనస్విని(8)ని కూడా గొంతు నులిమి ప్రాణం తీశాడు.

Also Read: చిచ్చురేపిన అక్రమ సంబంధం.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఉదయం కనిపించిన రమ్య, మనస్విని మధ్యాహ్నమైనా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Also Read: కోతిని కొట్టి, చెట్టుకు ఉరేసి చంపిన దుర్మార్గులు.. ఖమ్మం జిల్లాలో అమానుషం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.