యాప్నగరం

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. మోజు తీరాక మొహం చాటేసి

యువకుడి మాయమాటలు నమ్మి భర్తను వదిలేసిన జ్యోతి ప్రియుడితో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది. మోజు తీరాక ప్రియుడు మొహం చాటేయడంతో అతడి ఇంటి ఎదుట ఆందోళణ చేపట్టింది.

Samayam Telugu 3 Aug 2020, 2:37 pm
ప్రియుడి మాయమాటలు విని భర్తను వదిలేసిన మహిళ దారుణంగా మోసపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ములకలపల్లి మండలం ముత్యంపాడు గ్రామానికి చెందిన తాటి రాజారావు, నాగమణి దంపతులకు ప్రవీణ్‌ అనే కొడుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మడకం నర్సింహారావు భార్య జ్యోతిపై కన్నేసిన అతడు మూడు సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. భర్తను వదిలేసి వస్తే తాను పెళ్లి చేసుకుంటానని, హాయిగా కాపురం చేసుకోవచ్చని మాయమాటలు చెప్పేవాడు.
Samayam Telugu ఆందోళన చేస్తున్న జ్యోతి


Also Read: ఆస్తి కోసం బంధువుల ఘాతుకం.. యువకుడి గొంతు కోసి హత్య

కొద్దిరోజుల తర్వాత అతడి మాయలో పడిన జ్యోతి భర్తను వదిలేసి ప్రవీణ్ దగ్గరకు వచ్చేసింది. దీంతో అతడు అదే గ్రామంలో జ్యోతితో సహజీవనం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతి కోరగా అప్పటి నుంచి మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన జ్యోతి తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. దీంతో ప్రవీణ్ అతడి కుటుంబసభ్యులు పరారయ్యారు.

Also Read: హైదరాబాద్: ఆన్‌లైన్ క్లాసులు అర్థం కావడం లేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.