యాప్నగరం

పెళ్లైన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య.. అన్నదమ్ములపై భార్య ఫిర్యాదు

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని మహరాజుపేట గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 20 Aug 2020, 9:45 am
పెళ్లయిన 20 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరిగింది. మండలంలోని మహరాజుపేట గ్రామానికి చెందిన ఈగల నర్సింహులు (35)కు, గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన కుమారితో 20 రోజుల క్రితం వివాహమైంది. రెండ్రోజుల క్రితం భార్యను పుట్టింట్లో వదిలి వచ్చిన నర్సింహులు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: పెళ్లయిన 2 నెలలకే యువతి ఆత్మహత్య.. చంపేశారంటున్న తల్లిదండ్రులు

భర్త మరణ వార్త విని షాకైన కుమారి వెంటనే అత్తింటికి చేరుకుంది. అతడిది ఆత్మహత్య కాదని, అన్నదమ్ములతో ఆస్తి గొడవల కారణంగానే అతడు చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దీనిపై భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కర్నూలు: రెచ్చిపోయిన గ్రామ వాలంటీర్.. పక్కింటి మహిళపై హత్యాయత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.