వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతో మహిళ భర్త ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో వెలుగుచూసింది. పరవాడ మండలం బండారుపాలెం నుంచి ముత్యాలమ్మపాలెం వెళ్లే మార్గంలోని తోటల్లో ధర్మరాజు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా అతడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.
Also Read: భర్త దుబాయ్లో.. కామంతో రెచ్చిపోయి 16ఏళ్ల బాలుడితో ఆంటీ రాసలీలలు
పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు(40) అచ్యుతాపురంలోని ఒక కంపెనీలో కార్మికునిగా పనిచేసేవాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ధర్మరాజు.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి సారా తాగడానికి తరుచూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళతో చనువు ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ ఇద్దరు ముత్యాలమ్మపాలెం- బండారుపాలెం మధ్యలోని జీడిమామిడి తోటల్లో తరచూ శారీరకంగా కలుసుకునేవారు.
Also Read: నాలుగేళ్లుగా డ్రైవర్తో అఫైర్.. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికెళ్లి శృంగారం, చివరికి
ఈ విషయం మహిళ భర్త కుళ్లయ్యకు తెలియడంతో ధర్మరాజుపై కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 2న తన భార్య నగదు, సారాయి పట్టుకొని బయటకు వెళ్లడం కుళ్లయ్య గమనించాడు. సెల్ఫోన్ ఛార్జర్ పట్టుకుని చాటుగా ఆమెను వెంబడించాడు. జీడితోటలో ఇద్దరూ ఏకాంతంగా గడపడం చూసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో కుళ్లయ్యపై ధర్మరాజు ఎదురుతిరిగాడు. కోపోద్రిక్తుడైన కుళ్లయ్య సెల్ఫోన్ ఛార్జర్ వైరును ధర్మరాజు గొంతుకు బిగించి చంపేసి పరారయ్యాడు.
Also Read: కడప: తండ్రీ, కూతుళ్ల ఆత్మహత్య కేసులో షాకింగ్ కోణం.. అసలు కారణం అదే
మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ ధర్మరాజు భార్య మూడో తేదీ పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆరో తేదీన అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కుళ్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Also Read: ‘నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా.. ఎక్కడైనా కలుద్దామా’.. గుంటూరు వ్యాపారికి హనీట్రాప్
Also Read: భర్త దుబాయ్లో.. కామంతో రెచ్చిపోయి 16ఏళ్ల బాలుడితో ఆంటీ రాసలీలలు
పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు(40) అచ్యుతాపురంలోని ఒక కంపెనీలో కార్మికునిగా పనిచేసేవాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ధర్మరాజు.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి సారా తాగడానికి తరుచూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళతో చనువు ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ ఇద్దరు ముత్యాలమ్మపాలెం- బండారుపాలెం మధ్యలోని జీడిమామిడి తోటల్లో తరచూ శారీరకంగా కలుసుకునేవారు.
Also Read: నాలుగేళ్లుగా డ్రైవర్తో అఫైర్.. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికెళ్లి శృంగారం, చివరికి
ఈ విషయం మహిళ భర్త కుళ్లయ్యకు తెలియడంతో ధర్మరాజుపై కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 2న తన భార్య నగదు, సారాయి పట్టుకొని బయటకు వెళ్లడం కుళ్లయ్య గమనించాడు. సెల్ఫోన్ ఛార్జర్ పట్టుకుని చాటుగా ఆమెను వెంబడించాడు. జీడితోటలో ఇద్దరూ ఏకాంతంగా గడపడం చూసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో కుళ్లయ్యపై ధర్మరాజు ఎదురుతిరిగాడు. కోపోద్రిక్తుడైన కుళ్లయ్య సెల్ఫోన్ ఛార్జర్ వైరును ధర్మరాజు గొంతుకు బిగించి చంపేసి పరారయ్యాడు.
Also Read: కడప: తండ్రీ, కూతుళ్ల ఆత్మహత్య కేసులో షాకింగ్ కోణం.. అసలు కారణం అదే
మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ ధర్మరాజు భార్య మూడో తేదీ పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆరో తేదీన అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కుళ్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Also Read: ‘నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా.. ఎక్కడైనా కలుద్దామా’.. గుంటూరు వ్యాపారికి హనీట్రాప్