యాప్నగరం

కారు డ్రైవర్‌తో వివాహిత అఫైర్.. కళ్లలో కారం కొట్టి దారుణహత్య

భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత కారు డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల అతడితో మనస్పర్థలు రావడంతో అత్యంత కిరాతకంగా చంపేసింది.

Samayam Telugu 18 Mar 2020, 12:52 pm
వివాహేతర సంబంధంలో ఏర్పడిన గొడవలతో ఓ మహిళ ప్రియుడిని హత్య చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తేని జిల్లాకు చెందిన దంపతులకు కేరళలో 15 ఎకరాల పొలం ఉంది. వారి వద్ద కారు డ్రైవర్‌గా కేరళకి చెందిన రాజా(31) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయిన మహిళకు రాజాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డు లేకపోవడంతో అతడితో చాలారోజులు సహజీవనం చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
Samayam Telugu 01_0.


Also Read: పెళ్లికాని యువకుడిపై కన్నేసిన అమీర్‌పేట ఆంటీ ... అఫైర్ పెట్టుకోవాలంటూ సైబర్ వేధింపులు

రాజాపై కక్షగట్టిన మహిళ కొన్ని రోజుల క్రితం అతడితో గొడవపడింది. దీంతో ప్రియుడిపై కక్షగట్టిన ఆమె చంపేయాలని నిర్ణయించుకుంది. సోమవారం మాట్లాడుకుందామని రాజాను ఓ నిర్మానుష్య ప్రాంతానికి పిలిచింది. ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కారాన్ని అతడి కళ్లల్లో జల్లింది. బాధతో విలవిల్లాడుతున్న అతడిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: మొదటి భార్య ఉండగానే రెండోపెళ్లి.. కానిస్టేబుల్‌పై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.