యాప్నగరం

భార్య ఎదుటే బెడ్రూమ్‌లో ప్రియురాలితో రాసలీలలు.. తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే..

పెళ్లయి ఎనిమిదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో భర్త ఆమెను వేధించేవాడు. అంతటితో ఆగకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య ఎదుటే రొమాన్స్ చేసేవాడు.

Samayam Telugu 10 Feb 2020, 9:25 am
భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని డి.కొత్తూరుకు చెందిన నాగవెంకట వరలక్ష్మికి (28) నక్కపల్లికి చెందిన కొప్పిశెట్టి చినరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో చినరాజు ఆమెను పట్టించుకోవడం మానేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
Samayam Telugu pjimage (6)


Also Read: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణహత్య.. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి

భార్య ఎదుటే ప్రియురాలితో సన్నిహితంగా ఉంటూ తీవ్రంగా వేధించాడు. దీనికి తోడు అత్తమామలు కూడా వరలక్ష్మిని సూటిపోటి మాటలతో వేధించేశారు. శనివారం రాత్రి తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే గదిలోకి వెళ్లి రాసలీలలు కొనసాగించాడు. దీంతో సహించలేకపోయిన వరలక్ష్మి భర్తతో గొడవ పడింది. ఆవేశంలో మేడపైకి వెళ్లి దూకేసింది. దీంతో ఆమెను చినరాజు తుని ఆస్పత్రికి తీసుకెళ్తూ తిట్టి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఇత్మహత్య చేసుకుంది.

Also Read: మాజీ ప్రియురాలి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్

ఆత్మహత్యకు ముందు కొత్తూరులో ఉండే తన అక్క లావణ్యకు వాట్సాప్‌ విషయం చెప్పింది. తన మృతికి భర్త, అత్త, ఆడపడుచు, తన భర్త ప్రియురాలే కారణమని ఆరోపించింది. ఆమె అప్రమత్తమై బంధువులను హెచ్చరించేలోగానే వరలక్ష్మి ఉరేసుకుని చనిపోయింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఉద్యోగం పేరుతో అందమైన యువతులను తెచ్చి.. హైటెక్ సెక్స్‌రాకెట్ గుట్టురట్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.