యాప్నగరం

మద్యం మత్తులో తిట్టిన భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

మద్యానికి బానిసైన భర్త ఏ పని చేయకపోవడంతో భాగ్యమ్మ మనోవేదనకు గురైంది. ఏ పనీ చేయకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావని భర్తను నిలదీసింది. అతడు తిట్టడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 25 May 2020, 10:37 am
భర్త తిట్టాడన్న ఆవేదనతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. పలమనేరు తాలూకా బైరెడ్డిపల్లె సమీపంలోని నెల్లిపట్ల సంతపేట గ్రామానికి చెందిన మునిరత్నం భార్య భాగ్యమ్మ(40) శనివారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మునిరత్నం రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఒంగోలులో కలకలం

రెండ్రోజుల క్రితం భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. కూలీ పనులకు వెళ్లకుండా మద్యం తాగితే కుటుంబాన్ని ఎలా పోషిస్తావంటూ భార్య ప్రశ్నించడంతో మునిరత్నం మందలించాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన భాగ్యమ్మ గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.