యాప్నగరం

మరో మహిళతో భర్త అఫైర్.. మామిడి తోటలో శవమై కనిపించిన భార్య

పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వినోద్ భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో తట్టుకోలేకపోయిన రేవతి మామిడి తోటలో ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 3 Sep 2020, 11:32 am
పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తనను వేధిస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు గ్రామీణ మండలంలోని గాజులపల్లిలో బుధవారం జరిగింది. గాజులపల్లికి చెందిన వినోద్‌కు, బంధువుల అమ్మాయి రేవతి(24)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల వినోద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రేవతి భర్తను నిలదీయడంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను ప్రియురాలితోనే ఉంటానని, నీకంటే ప్రియురాలే నాకు ఎక్కువ అని తేల్చి చెప్పాడు.
Samayam Telugu Image


Also Read: తుళ్లూరు: బావతో అక్రమ సంబంధం, భర్తను చంపేసి ఆత్మహత్యగా నాటకం

ఈ క్రమంలోనే మంగళవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రేవతి పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం గ్రామంలోని ఓ మామిడి తోటలో చీరతోనే ఉరేసుకున్న స్థితిలో రేవతిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రేవతిని భర్తే మామిడితోటకు పిలిపించి ఉరేసి చంపేశాడని ఆరోపిస్తూ చిత్తూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇష్టం లేని భార్యతో ఉండలేక.. ప్రియురాలితో కలిసి యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.