యాప్నగరం

గుంటూరు: రెండేళ్లకే నరకం చూపించిన భర్త.. పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య

పెళ్లయినప్పటి నుంచి భర్త తీవ్రంగా వేధిస్తుండటంతో రజనీ మనస్తాపానికి గురయ్యేది. ఆదివారం రెండో పెళ్లి రోజు కూడా నానా మాటలు అనడంతో తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 10 Aug 2020, 8:24 am
భర్త వేధింపుల తాళలేక పెళ్లి రోజే ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన గుంటూరు జిల్లా కర్లపాలెం మండల పరిధిలో ఆదివారం జరిగింది. పెదగొల్లపాలెం పంచాయతీ యారంవారిపాలెంకు చెందిన యారం ముసలయ్యకు, బాపట్ల మండలం మూలపాలేనికి చెందిన రజని(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆదివారం వీరి రెండో వివాహ వార్షికోత్సవం. అయితే కొంతకాలంగా భర్త తీవ్రంగా వేధిచండంతో రజనీ మనస్తాపానికి గురవుతూ వస్తోంది. ఆదివారం పెళ్లి రోజు అని కూడా చూడకుండా ఆమెను దుర్బాషలాడుతూ వేధించాడు.
Samayam Telugu Image


Also Read: భర్త మరణం తట్టుకోలేక నర్సు ఆత్మహత్య... అనాథలైన ముగ్గురు పిల్లలు

దీంతో మనస్తాపానికి గురైన రజని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమెన గమనించిన కుటుంబసభ్యులు బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. రజని బాబాయి మరియదాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి.. ఎస్ఐ శ్రీహరితో కలిసి సంఘటనా స్థలం పరిశీలించి వివరాలు సేకరించారు.

Also Read: కడప: తండ్రీ, కూతుళ్ల ఆత్మహత్య కేసులో షాకింగ్ కోణం.. అసలు కారణం అదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.