యాప్నగరం

పెళ్లయిన 13ఏళ్లకు అదనపు కట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

13ఏళ్ల క్రితం వివాహమైనా ఇంకా అదనపు కట్నం కోసం భర్త చేస్తున్నచిత్రహింసలు భరించలేక ధనలక్ష్మి మనోవేదనకు గురైంది. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 14 Jul 2020, 11:36 am
అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి, నల్గొండ జిల్లా వెలిమినేడుకు చెందిన పబ్బు గోపాల్‌‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత కూడా గోపాల్ అనేకసార్లు అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. దీనిపై 2012లో వలిగొండ పోలీస్‌స్టేషన్లో గోపాల్‌పై కేసు నమోదైంది.
Samayam Telugu Image


Also Read: ఇంటర్ బాలిక మధులికపై దాడి కేసు.. ప్రేమోన్మాదికి 15ఏళ్ల కారాగారం

అయినప్పటికీ తీరు మార్చుకోని అతడు భార్యను వేధిస్తూనే ఉన్నాడు. కూతురు పడుతున్న బాధలు చూడలేక పుట్టింటివారు రూ.లక్ష నగదు, 4 తులాల బంగారం అదనపు కట్నంగా ఇచ్చారు. అయినా ఆశ చావని గోపాల్ భార్యను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. మూడు రోజుల క్రితం జరిగిన గొడవలో అతడు ధనలక్ష్మిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కుమార్తెకి కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తల్లి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.