యాప్నగరం

ప్రియుడితో మనస్పర్థలు.. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

18ఏళ్లు భర్తతో కాపురం చేశాక మనస్పర్థలతో విడిపోయిన రుక్సానా.. దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సోమవారం అతడితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 21 Jul 2020, 1:26 pm
భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ అతడితో ఏర్పడిన విబేధాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడలోని అయ్యప్పనగర్‌కు చెందిన షేక్‌ రుక్సానా (35)కు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడికి చెందిన కరీముల్లాతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. భర్తతో మనస్పర్థల కారణంగా రుక్సానా ఏడాది క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే పోరంకి గ్రామానికి చెందిన కోన దుర్గాప్రసాద్‌ అనే ఎలక్ట్రీషియన్‌తో పరిచయం ఏర్పడి 10 నెలలుగా అతడితో సహజీవనం చేస్తోంది.
Samayam Telugu Image


Also Read: ఆడపడుచుని వ్యభిచార ముఠాకు అమ్మేసిన వదిన.. ప్రకాశం జిల్లాలో దారుణం

వీరు రెండు నెలలుగా కానూరులో నివాసముంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా గొడవ పడిన తర్వాత దుర్గాప్రసాద్ పనికి వెళ్లగా.. రుక్సానా ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆమెను దించగా అప్పటికే చనిపోయింది. దుర్గాప్రసాద్ వేధింపుల వల్లే రుక్సానా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: కర్నూలు: భర్తను చంపేసి యాక్సిడెంట్ నాటకం.. ప్రియుడితో కలిసి ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.