యాప్నగరం

మద్యం మత్తులో భర్తతో గొడవపడిన మహిళ.. తెల్లారేసరికి శవమై

శనివారం భర్తతో గొడవపడిన చాంద్‌బీ మనస్తాపంతో విషపు గుళికలు మింగేసింది. అస్వస్థతకు గురైన ఆమెను భర్త ఆస్పత్రికి తలరించాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

Samayam Telugu 1 Jun 2020, 11:39 am
మద్యం మత్తులో భర్తతో గొడవపడిన మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌ మండలంలో జరిగింది. బాలానగర్‌ బిల్డింగ్‌ తండాకు చెందిన గంగ్యా నాయక్, చాంద్‌బీ (35) భార్యాభర్తలు. కొంతకాలంగా దంపతులిద్దరూ గొడవ పడుతున్నారు. శనివారం ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత మరోసారి గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన చాంద్‌బీ రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగేసింది.
Samayam Telugu Image


Also Read: ఇంటర్ బాలికకు ప్రేమ వల.. గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన చాంద్‌బీని గుర్తించిన భర్త గంగ్యా నాయక్ వెంటనే షాద్‌నగర్ హాస్పిటల్‌కు తరలించాడు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు ఆదివారం ఉదయం చాంద్‌బీ ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: బ్లాక్‌మెయిల్ చేసి అమ్మాయిలతో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్.. నిందితుల్లో ఒకరికి కరోనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.