యాప్నగరం

అత్త తిట్టిందని కోడలు ఆత్మహత్య.. పటాన్‌చెరులో విషాదం

పనివాళ్లతో పాటు తనకు కూడా అదే భోజనం పెట్టడంపై మండిపడిన అత్త కోడలిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె భర్తలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది

Samayam Telugu 11 May 2020, 11:01 am
అత్త మందలించిందన్న కోపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కంచర్ల గ్రామానికి చెందిన శివాని(25)కి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన హనుమంతుతో 2014లో వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం పటాన్‌చెరులోని గోకుల్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. హనుమంతు తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. అతని కింద పని చేసే వారికి శివాని రోజూ భోజనం వండి పెట్టేది.
Samayam Telugu Image


Also Read: 17 మందిని బలిగొన్నఘోర ప్రమాదానికి ఏడాది... సాయం కోసం బాధితుల ఎదురుచూపులు

నెలరోజుల క్రితం హనుమంతు తల్లి కూడా పటాన్‌చెరుకు వచ్చి వారి వద్దే ఉంటోంది. శివానీ దంపతులు పనివారితో పాటే తాము కూడా అదే భోజనం తినేవారు. అయితే పనివారికి పెట్టే భోజనం తనకు వద్దని, వేరుగా వండాలని శివానీని అత్త చెప్పింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ నెల 9న హనుమంతు పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగివచ్చాడు. గదిలోకి వెళ్లి చూడగా శివాని ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

Also Read: భూ వివాదంతో సోదరుల ఘర్షణ.. తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.