యాప్నగరం

కోరికలు తీర్చుకుని మొహం చాటేసిన ప్రియుడు.. వివాహిత ఆత్మహత్య

భర్త చనిపోవడంతో ఒడిశా నుంచి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వలస వచ్చిన పద్మ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ప్రేమ వ్యవహారంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 16 Apr 2020, 3:09 pm
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన మాడపల్లి పద్మ(25) భర్త కొంతకాలం క్రితం ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆమె తన కొడుకు(6)ను తీసుకుని తూర్పుగోదావరి జిల్లాకు వలస వచ్చింది. పెద్దాపురం మండలంలోని వడ్లమూరు రోడ్డులో గల అపెక్స్‌ రొయ్యల పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తూ కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్‌లో నివసిస్తోంది.
Samayam Telugu pjimage (2)


Also Read: ఉద్యోగం దొరక్క వేశ్యగా మారిన వరంగల్ యువతి.. పోర్న్‌ సైట్లో వీడియోలు చూసి భర్త షాక్

తాను నివసించే గదిలోనే పద్మ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గమనించిన రూమ్‌మేట్స్ సోనాలి, మనీషా, గంగీ వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పద్మ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించిన సహోద్యోగి లైంగిక వాంఛలు తీర్చుకుని మొహం చాటేయడంతోనే పద్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.