యాప్నగరం

పెళ్లయిన 12ఏళ్లకు వరకట్న వేధింపులు.. విశాఖలో వివాహిత ఆత్మహత్య

మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్న కృష్ణవేణిని భర్త నాగరాజు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోవడంతో కడుపునొప్పితో చనిపోయిందని అత్తమామలకు ఫోన్ చేశాడు.

Samayam Telugu 27 Feb 2020, 10:32 am
వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో బుధవారం జరిగింది. అమృతపురం గ్రామానికి చెందిన వడిశెల నాగరాజు, కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన చెందిన కృష్ణవేణికి 12ఏళ్ల కిందట వివాహమైంది. వారికి యశస్విని(11), మహేష్‌ (8) సంతానం.
Samayam Telugu vizag


Also Read: భార్యను వివస్త్రను చేసి ఇనుప కడ్డీలతో ఒళ్లంతా వాతలు.. వనపర్తిలో భర్త కిరాతకం

ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3.45గంటల సమయంలో అత్తమామలకు ఫోన్‌ చేసిన నాగరాజు కృష్ణవేణికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశాడని, కొద్దిసేపటికి చనిపోయిందని చెప్పాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న వారు విగతజీవిగా పడివున్న తమ కూతురిని చూసి విలపించారు.

Also Read: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సమీపంలో ఘోరం.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లి రేప్

తమ కూతురిని అదనపు కట్నం, బంగారం తీసుకురావాలంటూ కొంతకాలంగా అత్త కన్నమ్మ, మామ వెంకునాయుడు చిత్రహింసలు పెడుతున్నారని, భర్త కూడా అనుమానంతో వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. వారిపై సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: సీఎం జగన్‌పై టిక్‌టాక్ వీడియో.. సొంత జిల్లా వ్యక్తిపై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.