యాప్నగరం

గుంటూరులో దారుణం.. భర్త లేని సమయంలో ఇంట్లో దూరి మహిళపై అఘాయిత్యం

ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు కేకలు వేయడంతో వారు పరారయ్యారు.

Samayam Telugu 20 Jan 2020, 12:02 pm
గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. భర్త బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి యత్నించారు. అయితే బాధితురాలు సకాలంలో ధైర్యంగా వ్యవహరించడంతో ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకుంది.
Samayam Telugu rape3


Also Read: గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు చీరాల వాసుల దుర్మరణం

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో ఓ మూగ మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. శనివారం రాత్రి ఆమె భర్త ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన రావిపాటి గోపి, కనుమూరి లక్ష్మణరావు దొంగచాటుగా ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయకుండా నోరు నొక్కేసి దుస్తులు విప్పేందుకు యత్నించారు.

Also Read: సికింద్రాబాద్‌‌లో దారుణం.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిని లాడ్జికి తీసుకెళ్లి రేప్

అయితే ధైర్యం చేసిన బాధితురాలు వారిని తోసేసి గట్టిగా కేకలు వేయడంతో కామాంధులు పరారయ్యారు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్తకు ఆమె సైగలతో విషయం చెప్పడంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: ఓఆర్ఆర్‌పై పేలిన కారు టైరు... టీఆర్ఎస్ నేత మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.