యాప్నగరం

భర్త వేధింపులు.. మల్కాజ్‌గిరిలో వివాహిత ఆత్మహత్య

Malkajgiri: పెళ్లి స‌మ‌యంలో రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక ఎకరా భూమిని కట్నంగా ఇచ్చారు. ప్రత్యూష ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన కొంత కాలం తర్వాత అదనపు కట్నం కోసం రమేష్ ఆమెను వేధించడం తీవ్రం చేశాడని బంధువులు చెప్పారు.

Samayam Telugu 27 Sep 2020, 6:35 pm
కట్నం వేధింపుల‌కు మ‌రో వివాహిత బ‌లయ్యింది. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ప్రత్యూష (21) అనే మ‌హిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె గొంతుపై గోరు గాట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకి రెండేళ్ల కిందట రమేష్‌తో వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. అదనంగా కట్నం కోసం భర్త వేధించినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Dead hand


అయితే, పెళ్లి స‌మ‌యంలో రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక ఎకరా భూమిని కట్నంగా ఇచ్చారు. ప్రత్యూష ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన కొంత కాలం తర్వాత అదనపు కట్నం కోసం రమేష్ ఆమెను వేధించడం తీవ్రం చేశాడని బంధువులు చెప్పారు. ఇవి భరించలేకపోయిన ప్రత్యూష ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె గొంతుపై గోరుగాట్లు ఉండడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.