యాప్నగరం

డ్యూటీకి వెళ్లిన భర్త.. పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయిన భార్య

మీర్‌పేట్ నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేస్తున్న అక్బర్ భార్య నవాబీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 31 Aug 2020, 9:03 am
భర్త ఇంట్లో లేని సమయంలో భార్య పిల్లలను వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మీర్‌పేట్‌ నందనవనంలో ఎస్‌కే అక్బర్‌ అనే వ్యక్తి భార్య నవాబీ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే అతడు డ్యూటీలో భాగంగా ఈ నెల 25వ తేదీన కర్నూలు వెళ్లాడు. ఆ తర్వాతి రోజే నవాబీ పిల్లలను ఇంట్లోనే వదిలి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
Samayam Telugu నవాబీ(ఫైల్ ఫోటో)


Also Read: ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాలో విహారయాత్ర... గుట్టురట్టు చేసిన కరోనా

దీంతో పిల్లలు తండ్రికి ఫోన్ చేసి అమ్మ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పారు. అక్బర్ వెంటనే ఇంటికి చేరుకుని బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ రావడంతో ఏం జరిగిందోనని కంగారుపడుతూ శనివారం రాత్రి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య మిస్సింగ్ వెనుక దేవి అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఫ్రెండ్ ఇంటికెళ్లి తిరిగిరాని యువతి.. హైదరాబాద్‌లో మిస్సింగ్ కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.