యాప్నగరం

విశాఖలో విషాదం.. తోటికోడలిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన మహిళ

తోడికోడలిపై కక్ష పెంచుకున్న పావని బుధవారం ఆమె బిల్డింగ్‌పై కుట్టుమిషన్ కుడుతుండగా పెట్రోల్ జల్లి నిప్పు పెట్టింది. ఈ క్రమంలో ఆమె పావనిని కూడా పట్టుకోవడంతో ఇద్దరూ మంటల్లో కాలిపోయారు.

Samayam Telugu 30 Jan 2020, 12:37 pm
కుటుంబ తగాదాల నేపథ్యంలో తోటికోడలిపై కక్ష పెంచుకున్న మహిళ ఆమెను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేసిన ఘటన విశాఖ నగరంలో బుధవారం జరిగింది. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలేనికి చెందిన దాడి గణేష్‌, వెంకటరమణ అన్నదమ్ములు. ఇద్దరూ ప్లంబింగ్‌ పనులు చేసుకుంటూ ఒకే భవనంలో కింద, పైఅంతస్తుల్లో వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. చిన్నవాడైన వెంకటరమణ భార్య పావని(30)కి, పెద్దవాడైన గణేష్‌ భార్య రామలక్ష్మి(35)కి అస్సలు పడదు. ఎన్నోసార్లు వారిద్దరు గొడవలు పడ్డారు.
Samayam Telugu vizag


Also Read: యువకుడిపై కన్నేసిన వివాహిత... కోరిక తీర్చలేదని మత్తిచ్చి అత్యాచారం

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మేడపై ఒంటరిగా మిషన్‌ కుడుతున్న రామలక్ష్మి దగ్గరకు వెళ్లిన పావని వెళ్లి గొడవ పడింది. ఇద్దరికీ మాటామాట పెరిగిన సమయంలో పావని వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌ను రామలక్ష్మిపై పోసి నిప్పంటించింది. మంటల్లో కాలిపోతున్న రామలక్ష్మి తోటికోడలిని కూడా పట్టుకోవడంతో ఆమెకూ గాయాలయ్యాయి.

Also Read: కర్నూలు జిల్లాలో దారుణం.. బాలుడిని గ్యాంగ్‌రేప్ చేస్తూ వీడియో తీసి

మంటల్లో కాలిపోతూ ఇద్దరూ రోడ్డుపైకి రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసి కేజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా కాలిపోయిన రామలక్ష్మి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోగా.. పావతి 35శాతం గాయాలతో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో చనిపోయే ముందు రామలక్ష్మి నుంచి సీఐ రమణయ్య వాంగ్మూలం తీసుకున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి కీలక ఆధారాలు సేకరించారు. మృతురాలి భర్త గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఆంటీలను సుఖపెడుతూ రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్‌లో మగ వ్యభిచారుల ఉద్యోగమంటూ టోకరా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.