యాప్నగరం

హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త గల్ఫ్‌లో

జేబా ఫాతిమా ఈ నెల 18న మౌత్ ఫ్రెషనర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 24న చనిపోయింది.

Samayam Telugu 28 Mar 2020, 10:41 am
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చాంద్రాయణగుట్టకు చెందిన షోయెబ్‌కు జేబా ఫాతిమాకు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. మూడేళ్ల కిందట షోయెబ్‌ గల్ఫ్‌కు వెళ్లగా భార్య జేబా ఫాతిమా(37) నగరంలోనే ఉంటోంది. తన తల్లి, సోదరుడితో పాటు ఈ నెల 10న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 1లోని ఓ హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో మౌత్‌ ఫ్రెష్‌నర్‌ ద్రవాన్ని తాగి అస్వస్థతకు గురైన ఫాతిమాను కుటుంబసభ్యులు 18వ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె 24న మృతి చెందింది.
Samayam Telugu dead body


Also Read: ‘కరోనా’పై చెత్త పోస్ట్... బెంగళూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్

షోయెబ్‌ విదేశాల నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో బంధువైన సయ్యద్‌ రజాహుస్సేన్‌ రజ్వీకి శుక్రవారం ఫోన్‌చేసి అపోలో ఆస్పత్రికి వెళ్లాలని కోరాడు. ఆస్పత్రిలో మృతదేహాన్ని చూసిన రజ్వీ ఆమె మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట నిమిత్తం పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: హోటల్‌లో పనిచేసే బాలికపై యజమాని రేప్... గర్భం దాల్చిన బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.