యాప్నగరం

భార్య అందంగా ఉందని ఈర్ష్య.. వేధించి ప్రాణం తీసిన శాడిస్ట్ భర్త

భార్య అందంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన సుబ్రమణి ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమెతో బయటకు వెళ్లేవాడు కాదు. నీ కారణంగా నన్ను ఎవరూ చూడటం లేదంటూ వేధింపులకు గురిచేసేవాడు.

Samayam Telugu 29 Jan 2020, 12:53 pm
భార్య అందంగా ఉండాలని కోరుకోని భర్తలు కూడా ఉంటారా.. ఈ దుర్మార్గుడిని చూస్తూ ఉంటారనే అనిపిస్తుంది. కట్టుకున్న భార్య అందంగా ఉందని పీడించి వేధించి చివరకు ఆమె ప్రాణాలు తీసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్‌ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణికి రెండు సంవత్సరాల క్రితం హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీ (26)తో వివాహమైంది.
Samayam Telugu wife


Also Read: వ్యభిచారం చేయాలంటూ టిక్‌టాక్ ఫ్రెండ్స్ వేధింపులు.. ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

అందంగా ఉండే జయశ్రీపై సుబ్రమణి తొలి నుంచి అనుమానం పెంచుకున్నాడు. జంటగా ఎక్కడికెళ్లినా అందరూ ఆమెను చూస్తున్నారన్న ఆక్రోశంతో బయటికి తీసుకెళ్లేవాడు. నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవాడు. గుడికి వెళ్లినా ఆమెకు దూరంగానే ఉండేవాడు. అయితే కుటుంబ కట్టుబాట్ల కారణంగా జయశ్రీ ఆ వేధింపులన్నీ భరిస్తూ వచ్చింది. అతడి పైశాచికం మరింత పెరగడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది.

Also Read: రెండో భర్తను బంధించి గోళ్లు పీకేసి.. కిరాతకంగా హత్యచేసిన మహిళా టెక్కీ

అయితే తాము రెండ్రోజుల్లో వచ్చి అల్లుడితో మాట్లాడతామని వారు నచ్చజెప్పారు. ఈ పరిణామాల మధ్యే జయశ్రీ ఆదివారం ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. సర్జాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జయశ్రీని ఆమె భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 13ఏళ్ల బాలికపై పది రోజులుగా అత్యాచారం.. హైదరాబాద్‌లో మరో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.