యాప్నగరం

శ్రీకాకుళం: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఏడాదికే విగతజీవిగా మారి

ఏడాది క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లాడిన యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అయితే తమ కూతురిని భర్త, అత్తమామలే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 4 Sep 2020, 8:46 am
పెద్దలను ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లాడిన యువతి ఏడాది తిరగకముందే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన బగాది శిరీష (22), ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామానికి చెందిన బోనెల హేమసుందరరావును ప్రేమించింది. వీరి ప్రేమకు శిరీష తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లాడింది. వీరి వివాహాన్ని పొందూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేసుకున్నారు.
Samayam Telugu Image


Also Read: రూ.3వేల కోసం ఫ్రెండ్‌నే చంపేశాడు.. మద్యం మత్తులో కిరాతకం

ప్రస్తుతం ఈ దంపతులు పెయ్యలవానిపేటలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం శిరీష ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే తమ కూతురిని భర్త, అత్తమామలే చంపేశారని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరకట్నం కోసం ఆరు నెలలుగా శిరీషను చిత్రహింసలు పెడుతున్నారని, అత్తింట్లో పడుతున్న బాధలను తమ కూతురు ఫోన్లో చెప్పి బాధపడేదని చెబుతున్నారు. దీనిపై శిరీష తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పెళ్లి కాని మహిళకు యువకుడి వల.. ఏడాదిగా లైంగికంగా దోచుకుంటూ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.