యాప్నగరం

Medchal: పసిబిడ్డతో కలిసి వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ 13నెలల బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని నీళ్ల సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 11 Oct 2019, 3:02 pm
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కత్బుల్లాపూర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. షిర్డీ హిల్స్‌లోని మసీద్ సమీపంలో లావణ్య(38) అనే వివాహిత 13 నెలల బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి సంపులో లావణ్య బిడ్డతో సహా విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Samayam Telugu suicide


Also Read: అక్కలేని సమయం చూసి.. బెడ్రూమ్‌లో బావతో రాసలీలలు

మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన మల్లేశ్ 10 సంవత్సరాల క్రితం భార్యతో కలిసి కుత్బుల్లాపూర్‌కు వలస వచ్చాడు. మొదటి భార్యకు పిల్లలు కలగకపోవడంతో ఆరు సంవత్సరాల క్రితం లావణ్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టాక దంపతుల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. దీంతో లావణ్య తరుచూ భర్తతో గొడవపడేది.

Also Read: వామ్మో.. హైదరాబాద్‌లో ప్లాస్టిక్ పాలు కూడా అమ్మేస్తున్నారు

ఈ క్రమంలోనే గురువారం రాత్రి లావణ్య 13 నెలల కుమారుడితో కలిసి ఇంట్లోని సంపులోకి దూకింది. ఊపిరాడకపోవడంతో కొద్ది నిమిషాల్లోనే తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం సంపులో రెండు మృతదేహాలను గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: తల్లిదండ్రుల కిరాతకం.. ప్రేమలో పడిందని కూతుర్ని నదిలోకి తోసేశారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.