యాప్నగరం

కాబోయే డాక్టర్ కాల్వలో పడి.. గుంటూరు జిల్లాలో విషాద ఘటన

వైద్య విద్య ఫైనలియర్ చదువుతున్న యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. కాలుజారి కాల్వలో పడి గల్లంతయ్యాడు. మరుసటి రోజు విగతజీవిగా కనిపించాడు.

Samayam Telugu 24 Nov 2020, 4:24 pm
గుంటూరు జిల్లా తెనాలిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థి ప్రమాదవశాత్తూ కాలుజారి కాల్వలో పడిపోయి గల్లంతయ్యాడు. ఈరోజు మధ్యాహ్నం కాల్వలో శవమై కనిపించాడు. పట్టణానికి చెందిన యారవ సాయి హర్షవర్ధన్ రెడ్డి(23) అమలాపురంలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. సొంతూరు వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి సమయంలో కాలుజారి పట్టణంలోని పశ్చిమ కాల్వలో పడిపోయాడు. నీటమునిగి కనిపించకుండా పోయాడు.
Samayam Telugu సాయి హర్షవర్ధన్ రెడ్డి


యువకుడు కాల్వలో గల్లంతైన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వ వెంబడి గాలించగా పెదరావూరు వద్ద హర్షవర్ధన్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. చేతికంది వచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read:
పనిమనిషిపై కన్నేసిన డాక్టర్.! స్నేహితులతో గడపాలంటూ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.