యాప్నగరం

వివాహితపై వేట కొడవళ్లతో దాడి.. చిత్తూరు జిల్లాలో దారుణం

భూ తగాదాలతో ప్రత్యర్థి వర్గం తులసిపై వేటకొడవళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 10 Aug 2020, 4:24 pm
భూమి తగాదా ఓ మహిళ ప్రాణం మీదికి తెచ్చింది. ప్రత్యర్థులు వేట కొడవలితో దాడికి పాల్పడటంతో ఓ మహిళ హాస్పిగల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని కంభంవారిపల్లె మండలంలోని మారేల్లా పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి అదే గ్రామానికి చెందిన ఆనంద్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. దీనిపై రెండు వర్గాలు కోర్టును ఆశ్రయించడంతో కేసులు నడుస్తున్నాయి.
Samayam Telugu Image


Also Read: ఆంటీని దోచుకున్న యువకులు.. ఆరా తీస్తే సెక్స్‌ కుంభకోణం గుట్టురట్టు

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు.. ఆనందరెడ్డి, వెంకటరమణారెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కృష్ణారెడ్డి రెండో కూతురు తులసిపై ప్రత్యర్థులు కొడవలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తులసిని స్థానికులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: పులివెందులలో మహిళ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడా?

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంభంపల్లెవారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘తనను, తులసిని హత్య చేసేందుకు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు’ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడంతో పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్: అర్ధరాత్రి ప్రియుడి ఇంటికొచ్చిన మహిళ.. తెల్లారేసరికి శవమై

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.