యాప్నగరం

దొంగసొమ్ము కోసం దారుణం.. బాలుడిని కొట్టిచంపేసి.. చిత్తూరులో ఘోరం

బంధువుల ఇంట్లో బాలుడు సెల్‌ఫోన్ చోరీ చేశాడు. దానిని పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ షాపులో విక్రయించాడు. దొంగతనం బయటపడిందని.. ఫోన్ తిరిగి ఇచ్చేయమన్నందుకు ఓనర్..

Samayam Telugu 31 Jul 2020, 5:04 pm
దొంగసొమ్ముని తిరిగి ఇచ్చేయమన్నందకు ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. బాలుడిని చావబాది ప్రాణాలు తీశాడు. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన బాలుడు తన బంధువుల ఇంట్లో సెల్‌ఫోన్ చోరీ చేశాడు. అది తీసుకెళ్లి స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపులో అమ్మేశాడు. దొంగిలించిన సొమ్ము కావడంతో కేవలం రూ.2000లకే విక్రయించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అయితే రెండు రోజుల అనంతరం బాలుడి దొంగతనం బయటపడింది. బాలుడిపై అనుమానం వచ్చిన బంధువులు గట్టిగా నిలదీయడంతో సెల్‌ఫోన్ తానే చోరీ చేసినట్లు ఒప్పుకుని తిరిగి ఇచ్చేస్తానని బతిమాలుకున్నాడు. షాపుకెళ్లి సెల్‌ఫోన్ తిరిగివ్వాలని అడిగాడు. తక్కువ ధరకే ఫోన్ కొట్టేసిన యజమాని చాంద్ బాషా.. దొంగసొమ్ముని తిరిగిచ్చేందుకు ససేమిరా అన్నాడు.

Also Read: బీచ్‌లో బట్టలిప్పేసి నగ్నంగా.. విశాఖ వాసుల బీభత్సం

అంతటితో ఆగకుండా బాలుడిని చిత్రహింసలకు గురిచేశాడు. విచక్షణారహితంగా కొట్టి హింసించాడు. షాపు యజమాని దెబ్బలకు తీవ్రగాయాలపాలైన బాలుడు పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలేశాడు. దీంతో దొంగసొమ్ము కొనుగోలు చేయడంతో పాటు.. బాలుడి మరణానికి కారణమైన సెల్‌ఫోన్ షాపు యజమాని చాంద్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also:
యువతిని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. పది మంది.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.