యాప్నగరం

మద్యానికి బానిసైన తల్లి.. కొట్టి చంపేసిన మైనర్లు

40 ఏళ్ల వయస్సున్న మహిళ నిత్యం మద్యం తాగేది. మద్యం మత్తులో కన్నబిడ్డల్ని హింస పెట్టేది. రోజూ తాగివచ్చి కొడుకులతో గొడవకు దిగేది. ఈ క్రమంలో ముగ్గురు మధ్య గొడవ జరిగింది.

Samayam Telugu 18 Sep 2020, 8:51 am
కన్నతల్లిని కడుపున పుట్టిన బిడ్డలే హత్య చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలో కలకలం రేపింది. మద్యానికి బానిసైన తల్లి నిత్యం తాగి వచ్చి తమను వేధింపులకు గురి చేయడం తట్టుకోలేపోయారు. దీంతో ఇద్దరు కుమారులు తల్లిని పాశవికంగా ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. భువనేశ్వర్‌ జిల్లా సుందర్‌పాడలో ఈ ఘటన జరిగింది. ఘాతుకానికి ఒడిగట్టిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందర్‌పాడ ప్రాంతంలో ఓ మహిళ(40)కు ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు.
Samayam Telugu మద్యానికి బానిసైన తల్లి
sons killed mother


మద్యానికి బానిసైన మహిళ నిత్యం తాగివచ్చి పిల్లలను చిత్రహింసలు పెట్టింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సైతం పూటుగా మద్యం తాగి కుమారులతో గొడవపడింది. దీంతో తల్లి కొడుకుల మధ్య మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు కుమారులు పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో ఆమెను కర్కషంగా చావబాదారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అయితే అక్కడ నుంచి ఇద్దరు కొడుకులు పరారయ్యారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను బాధితురాలిని దవాఖానకు తరలించే ప్రయత్నం చేశారు, అయితే ఈలోపే ఆమె మృతి చెందిందని భువనేశ్వర్ పోలీసు డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఉమాశంకర్ డాశ్‌ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మద్యానికి బానిసైన తల్లి వేధింపులు తట్టుకోలేకే ఆమెను హతమార్చినట్లు పోలీసుల విచారణలో ఇద్దరు మైనర్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.