యాప్నగరం

ఎవరికీ చెప్పుకోలేదని.. బధిర బాలికను లాక్కెళ్లి.. విశాఖలో అమానుషం

ఏం చేసినా చెప్పలేని బధిర బాలికపై కామాంధుడి కన్ను పడింది. అదను చూసి ఆమెను ఇంటికి దూరంగా లాక్కెళ్లి దారుణంగా రేప్ చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 16 Feb 2020, 3:07 pm
నిర్భయ, దిశ ఘటనలతో కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం అత్యాచార ఘటనలు జరగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికలపై కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల్లా మీద పడి తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ ఎనిమిదేళ్ల బధిర బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu child rape1


అనకాపల్లి మండలానికి చెందిన బధిర బాలికపై అదే ప్రాంతానికి చెందిన రాజాన సింహాచలం కన్నేశాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెను ఇంటి నుంచి దూరంగా లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. పశువులా ఆమెపై పడి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

Also Read: వైద్యం చేయిస్తే డబ్బులైపోతాయని కన్నకూతురినే.. సంగారెడ్డిలో దారుణం

తనపై జరిగిన అఘాయిత్యాన్ని కనీసం నోటితో చెప్పలేని బధిర బాలికపై కామాంధుడు దాష్టీకానికి పాల్పడుతుండగా పొరుగింటి మహిళ గమనించింది. వెంటనే బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అభంశుభం తెలియని బధిరురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు సింహాచలంని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also: ఆ శృంగారం కావాలంటే.. ట్రాన్స్‌జెండర్లు, గేలతో సెక్స్ ట్రాప్.. బాధితులంతా బడాబాబులే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.