యాప్నగరం

లిఫ్ట్ పేరుతో తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం

హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరుతో ఇద్దరు యువకులు మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Samayam Telugu 20 Aug 2019, 7:19 pm
లిఫ్ట్ పేరుతో ఇద్దరు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసుకొని నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కందుకూరు మండలం దన్నారం గ్రామానికి చెందిన బాధిత బాలిక మహేశ్వరంలో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే సోమవారం (ఆగస్టు 19) సాయంత్రం కాలేజీ అవర్స్ ముగిసిన అనంతరం ఆమె స్వగ్రామానికి వెళ్లడానికి మహేశ్వరం బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు మైనర్ బాలురు అక్కడికి వచ్చారు.
Samayam Telugu Representational Image


Read Also: గంజాయికి బానిసలై స్మగ్లర్లుగా మారి.. కటకటాల్లోకి ఖమ్మం విద్యార్థులు

బస్సు కోసం వేచి చూస్తున్న అమ్మాయిని ఆ మైనర్ బాలురు లిఫ్ట్ పేరుతో తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. పులిమామిడి వెళ్లే దారివైపు తీసుకెళ్లారు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Read Also: తండ్రిని ముక్కలుగా నరికి బకెట్లలో నింపి.. మల్కాజిగిరిలో దారుణం

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Note: The victim's identity has not been revealed to protect her privacy as per Supreme Court directives on cases related to sexual assault.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.