యాప్నగరం

బిర్యానీ కోసం అన్నతో గొడవ.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

బక్రీద్ సందర్భంగా పక్కింటి వారు ఇచ్చిన బిర్యానీ విషయంలో అన్నాచెల్లెలి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 3 Aug 2020, 10:23 am
బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మల్లాపూర్‌ డివిజన్‌‌లోని దుర్గానగర్‌కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె స్నేహ (11) ఉన్నారు. శనివారం తల్లిండ్రులు కూలిపనికి వెళ్లడంతో స్నేహా అన్నతో పాటు ఇంట్లోనే ఉంది. ఆరోజు బక్రీద్ సందర్భంగా పక్కింట్లో ఉంటే ఓ ముస్లిం కుటుంబం వారికి బిర్యానీ ఇచ్చింది.
Samayam Telugu స్నేహ(File Photo)


Also Read: హైదరాబాద్: ఫేస్‌బుక్ ప్రియురాలితో సహజీవనం.. మరొకరితో పెళ్లి

దీంతో బిర్యానీ తినే విషయంలో అన్నతో స్నేహ గొడవ పడింది. కాసేపటికే అన్న స్నేహితులతో ఆడుకునేందుకు బయటికి వెళ్లగా స్నేహ ఇంట్లోనే టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న ఆమెను చూసి షాకయ్యారు. వెంటనే నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఒక హత్యకు ప్రతీకారంగా రెండు హత్యలు.. నల్గొండ జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.