యాప్నగరం

‘నీ కూతురిని రాత్రికి పంపు... ఎకరం రాసిస్తా’ కామాంధుడి నీచపు వ్యాఖ్యలు

తనపై లైంగిక వేధింపుల విషయం గ్రామంలోని అందరికీ తెలియడంతో యువతి మనస్తాపానికి గురైంది. పంచాయతీ పెడితే తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే పురుగుల మందు తాగేసింది.

Samayam Telugu 12 Dec 2019, 10:35 am
‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కామాంధులందరికీ అలాంటి శిక్షలే వేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇద్దరు కిరాతకులు తమకూ అలాంటి గతే పడుతుందని భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఎక్కడోచోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని భూపాలపల్లిలో ఓ కామాంధుడు నీచపు వ్యాఖలు చేసి యువతి మరణానికి కారణమయ్యాడు.
Samayam Telugu rape8


Also Read: ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. హైదరాబాద్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు

వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా పర్లపల్లికి చెందిన గాదం ఐలయ్య అనే వ్యక్తి బుధవారం గ్రామంలో ఓ ఇంటికి మద్యం మత్తులో వెళ్లాడు. ఆ కుటుంబంలో పెళ్లీడికి వచ్చిన ఓ యువతి ఉంది. ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఐలయ్య యువతి తల్లి వద్ద ఓ ప్రస్తావన తెచ్చాడు. ‘ నీ కూతురంటే నాకు మోజు. ఆమెను ఒక్కరాత్రికి నా దగ్గరకు పంపిస్తే ఎకరం పొలం రాసిస్తా’ అంటూ అహస్యంగా మాట్లాడాడు. ఐలయ్య మాటలకు చిర్రెత్తుకొచ్చిన యువతి తల్లి ఆ కామాంధుడిని అక్కడే నిలదీసింది.

Also Read: పార్కులోనే బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అరెస్ట్

వెంటనే గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఐలయ్యపై ఫిర్యాదు చేసింది. పంచాయతీ పెట్టి అతడిని శిక్షించాలని కోరింది. దీంతో గ్రామపెద్దలు గురువారం పంచాయతీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ వార్త గ్రామంలోని అందరికీ తెలియడంతో యువతి మనస్తాపానికి గురైంది. పంచాయతీ పెడితే తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే పురుగుల మందు తాగేసింది. ఇది గమనించిన తల్లి కూతురిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి.

Also Read: ‘నా చెల్లి ప్రాణం తీసినోడిని కూడా అలాగే చంపేయాలి’.. శ్రీలక్ష్మీ అక్క డిమాండ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.