యాప్నగరం

నల్గొండలో బాలికపై గ్యాంగ్‌ రేప్.. గర్భం దాల్చడంతో వెలుగులోకి ఘటన

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు అదే గ్రామంలో ఉండే మైనర్ బాలికను బెదిరించి కొద్దిరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు.

Samayam Telugu 22 May 2020, 12:21 pm
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తిప్పర్తి మండలంలోని ఎర్రగడ్డలగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొందరు యువకులు లొంగదీసుకొని కొద్ది రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతోన్న ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి చూసింది. గ్రామానికి చెందిన బొబ్బలి నవీన్‌, గజ్జి రమేశ్‌, బాతుక శంకర్‌, సింగం అనిల్‌ అనే యువకుడు అదే గ్రామంలో ఉండే బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. కొద్దిరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ కామాంధులు బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.
Samayam Telugu Image


Also Read: కాటికెళ్లే వయసులో కామం.. ఇంట్లో పనిచేసే బాలికపై వృద్ధుడి అత్యాచారం

కొన్నిరోజులుగా కూతురు ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించడంతో బాలిక గర్భం దాల్చిందని తేలింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద మనుషులు రంగంలోకి దిగి రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. మంతనాలు ఫలించకపోవడంతోనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Also Read: ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం.. రూ.15 లక్షలివ్వాలంటూ మహిళకు బ్లాక్‌మెయిల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.