యాప్నగరం

గుడికెళ్లొస్తున్న బాలిక నోరుమూసి లాక్కెళ్లి.. రాత్రంతా నరకం.. ప్రూఫ్ అడిగిన పోలీస్

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. స్నేహితురాలితో కలసి గుడికి వెళ్లొస్తున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.

Samayam Telugu 25 Feb 2020, 5:16 pm
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. స్నేహితురాలితో కలసి గుడికి వెళ్లొస్తున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
Samayam Telugu minor girl gang raped while returning from temple cops apathy leads to suspension in chhattisgarh
గుడికెళ్లొస్తున్న బాలిక నోరుమూసి లాక్కెళ్లి.. రాత్రంతా నరకం.. ప్రూఫ్ అడిగిన పోలీస్



బాలికపై గ్యాంగ్ రేప్

మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్ చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. బలరాంపూర్ జిల్లా రామానుజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14) తన స్నేహితురాలితో కలిసి గుడికి వెళ్లి వస్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు వారిని అడ్డగించి అసభ్యంగా మాట్లాడడంతో పాటు వెకిలి చేష్టలు చేస్తూ వెంబడించారు. లైంగిక వేధింపులకు దిగారు.


Also Read: కొడుకును లాడ్జి గది బయట నిలబెట్టి.. ప్రియుడితో మహిళ రాసలీలలు.. భర్త వీడియో కాల్ చేయడంతో..

కామాంధులు ఆమెపై పడి..

కామాంధుల వేధింపులను ప్రతిఘటించిన ఓ బాలిక అక్కడి నుంచి పరారై తప్పించుకుంది. మరో బాలిక కూడా తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే ఆమెను గట్టిగా పట్టుకున్నారు ఇద్దరు కామపిశాచులు. ఆమె చేతికి చిక్కిన వెంటనే గట్టిగా నోరుమూసేసి అటవీ ప్రాంతంలో ఉన్న పాడుబడిన ఇంటి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో వ్యక్తితో కలసి ఆమెను దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు.

రాత్రంతా నరకం..

పాడుబడిన ఇంట్లో రాత్రంతా ఆమెకు నరకం చూపించారు. ముగ్గురు ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. రాత్రంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. తెల్లవారుజాము సమయంలో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. అయితే కామాంధుల బారి నుంచి తప్పించుకెళ్లిన బాలిక బాధితురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.


Read Also: ‘అంద’మైన కలలతో నగరానికి.. అనూహ్యంగా సూసైడ్.. ఓ యువతి విషాదాంతం

ఆస్పత్రికి బాధితురాలు

తమ కూతురుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. తక్షణం చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాల జాడ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఎలాగోలా ఇంటికి తిరిగివచ్చి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని భోరుమంది. నీరసంగా ఇంటికొచ్చిన బాలిక కడుపులో నొప్పితో తీవ్రంగా బాధపడుతుండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.


Read Also: ‘అంద’మైన కలలతో నగరానికి.. అనూహ్యంగా సూసైడ్.. ఓ యువతి విషాదాంతం

ప్రూఫ్ అడిగిన పోలీసులు

అనంతరం బాధితురాలిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయినా పోలీసులు సరిగ్గా స్పందించలేదు. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చాక రేప్ జరిగిందో లేదో నిర్ధారణకు వస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడడంతో బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. బాలికకు అన్యాయం జరిగితే పోలీసులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేటు వేసిన ఐజీ

విషయం చివరికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు వెళ్లడంతో ఆయన సీరియస్‌గా స్పందించారు. తక్షణం ఆ విషయాన్ని ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోలేదని.. వెంటనే నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఐజీ తక్షణ చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఇన్‌స్పెక్టర్‌పై ఐజీ వేటు వేశారు.


Also Read: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. గుంటూరు వాసుల దుర్మరణం

నిందితుల అరెస్ట్..

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు కుల్‌దీప్, పింటు ఠాకూర్ సహా మూడో నిందితుడైన మైనర్ బాలుడు(17)ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితులపై సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. బాలికపై గ్యాంగ్ రేప్ కేసు స్థానికంగా సంచలనం కలిగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.