యాప్నగరం

చెరుకుతోట వీడియోలు లీక్.. బాలికను రేప్ చేస్తున్న ఐదుగురు.. దారుణం

సోషల్ మీడియాలో రేప్ వీడియో కలకలం రేపింది. వీడియోలు వైరల్ కావడంతో బాలికపై ఐదుగురు దుర్మార్గుల సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 15 Sep 2020, 1:49 pm
మహిళ ఒంటరిగా కనిపిస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. జంకూబొంకూ లేకుండా బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారాలకు తెగబడుతున్నారు. అలాంటి దారుణ ఘటన మరోటి తాజాగా వెలుగుచూసింది. మార్కెట్‌కి వెళ్లిన బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆ నీచపు పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gangrape


సీతాపూర్ జిల్లాకి చెందిన మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. బాలికపై కన్నేసిన కామాంధులు షీబు, నజీమ్ మార్కెట్‌‌కి వెళ్లొస్తున్న సమయంలో ఆమెను అపహరించి నీచానికి పాల్పడ్డారు. బాలికను సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు స్నేహితులతో కలసి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశువుల్లా మీద పడి కామకోరికలు తీర్చుకున్నారు.

Also Read: ఘోరం.. గర్భిణి కడుపులో తన్నడంతో బయటకొచ్చిన బిడ్డ.. 7 నెలలకే..

అంతటితో ఆగని రాక్షసులు రేప్ చేస్తూ వీడియోలు తీసి పైశాచికానికి దిగారు. ఎవరికైనా చెబితే దారుణ పరిస్థితులు ఉంటాయని బెదిరించి పంపించేశారు. తీరా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చెరుకుతోటలో ఐదుగురు బాలికపై రేప్ చేస్తున్న వీడియోలు కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు షీబుని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: పరాయి వ్యక్తితో భార్య పడక సుఖం.! అనుమానంతో అత్తనీ వదలని అల్లుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.