యాప్నగరం

యువతి శవాన్ని బయటకు లాగిన కుక్కలు.. దారుణ హత్య వెలుగులోకి..

కోటిపల్లి ప్రాజెక్టు వద్ద యువతి శవం కనిపించడం సంచలనంగా మారింది. ఆమెను హత్య చేసి కవర్‌లో చుట్టి పూడ్చిపెట్టినట్టు తెలుస్తోంది.

Samayam Telugu 3 Oct 2020, 3:38 pm
ప్లాస్టిక్ కవర్లలో చుట్టి పూడ్చిపెట్టిన యువతి శవం వికారాబాద్‌లో కలకలం రేపుతోంది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద కవర్‌లో చుట్టి ఉన్న బాలిక మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు బాలికను హత్య చేసి పూడ్చిపెట్టారు. నాలుగు రోజుల కిందటే బాలికను హత్య చేసినట్లు తెలుస్తోంది. కోటిపల్లి ప్రాజెక్టు దిగువన పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని కుక్కలు లాగుతుండగా గుర్తించిన వ్యక్తి వెంటనే స్థానిక సర్పంచ్‌కి తెలియజేశాడు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu కవర్లలో చుట్టిపడేసిన బాలిక మృతదేహం
murder


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. యువతి శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. యువతి ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెను నాలుగు రోజుల కిందటే హత్య చేసి ఇక్కడకు తెచ్చి పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రియుడి కోసం తల్లి, ఆస్తి కోసం కొడుకు ఘాతుకం.. చిత్తూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.