యాప్నగరం

ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారం.. తెలంగాణలో మరో ఘోరం

బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Samayam Telugu 15 May 2020, 8:18 am
లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం పెన్షన్ తీసుకునేందుకు కుటుంబసభ్యులు పక్క గ్రామానికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Samayam Telugu Image


Also Read: ‘బిడ్డ తనకు పుట్టలేదని వదిలించుకున్న ప్రియుడు’.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

బాలిక అత్త ఇంటికి వస్తుండటాన్ని గమనించిన ఆ యువకుడు బయటకు పరుగు తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె ఏం జరిగిందోనన్న ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తస్రావంతో బాధపడుతోంది. దీంతో ఆమె వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలిక తల్లి వెంటనే యాలాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు వికారాబాద్‌ జిల్లా మహిళా సీఐ ప్రమీలతో విచారణ చేయించారు. యువకుడిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Also Read: మూడేళ్ల ప్రేమ... లాక్‌డౌన్‌లోనే పెళ్లి.. నెల తిరగకముందే ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.