యాప్నగరం

అమృతకు నా ఆస్తిలో ఒక్కపైసా కూడా ఇవ్వొద్దు.. వీలునామాలో మారుతీరావు

తన స్వార్జితమైన ఆస్తిలో తన కూతురికి ఒక్క పైసా కూడా దక్కకూడదని ముందుగానే వీలునామా రాయడంతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన పరువు హత్యగా నిర్ధారించారు.

Samayam Telugu 13 Jun 2019, 9:58 am

ప్రధానాంశాలు:

  • ప్రణయ్ హత్యకేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
  • మారుతీరావు ఉరే సరైనదంటున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu maruthi rao
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ దారుణహత్య కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనేక సంచలన విషయాలను పోలీసులు అందులో పేర్కొన్నారు. కూతురి కులాంతర వివాహంతో పరువు పోయిందని భావించిన మారుతీరావు ఆమెకు తన ఆస్తిలో ఒక్కపైసా కూడా దక్కకూడదని వీలునామాలో రాసినట్లు వెల్లడైంది. తన కూతురిని తనకు దక్కకుండా చేసిన ప్రణయ్‌ ప్రాణాలతో ఉండకూడదన్న కక్షతోనే అతడిని హత్య చేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 120 మందిని విచారించిన పోలీసులు 1600 పేజీల ఛార్జిషీటు రూపొందించారు.
ప్రణయ్‌ని హత్య చేసేందుకు మాజీ ఐఎస్ఐ తీవ్రవాదులతో రూ.కోటి సుపారీతో మారుతీరావు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. తన స్వార్జితమైన ఆస్తిలో తన కూతురికి ఒక్క పైసా కూడా దక్కకూడదని ముందుగానే వీలునామా రాయడంతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన పరువు హత్యగా నిర్ధారించారు. ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుకు పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆధారాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ కేసులో మారుతీరావుకు ఉరే సరైందని పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.