యాప్నగరం

ఇలాక్కూడా జరుగుతుంది.. మంచంపై నుంచి పడి యువకుడి దుర్మరణం

శుక్రవారం రాత్రి మద్యం తాగి మంచంపై పడుకున్న లాల్ నుంచమ నిద్రమత్తులో కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం తెల్లవారుజామున మిత్రడు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

Samayam Telugu 16 Feb 2020, 12:00 pm
మద్యం మత్తులో ఓ యువకుడు మంచంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో శనివారం వెలుగుచూసింది. మిజోరాం రాష్ట్రానికి చెందిన లాల్‌ నుంచమ(23) ఉపాధి నిమిత్తం కొంత కాలం క్రితం మేడ్చల్‌ జిల్లాకు వలస వచ్చాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలోని ఓ రిసార్ట్స్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ఫుల్లుగా మద్యం తాగాడు. అనంతరం తన గదిలోని మంచం(బంక్‌ బెడ్‌)పై పడుకున్నాడు.
Samayam Telugu ్ోద


Also Read: ప్రేమను తిరస్కరించిందని కన్నతల్లినే గొంతు కోసి చంపేసిన బాలిక

తెల్లవారు జామున అతడి ఫ్రెండ్ లాల్‌మాల్‌ సౌమ లేచి చూడగా లాల్‌ కింద పడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీంతో కంగారుపడిన అతడు వెంటనే రిసార్ట్స్‌ సిబ్బందికి, శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బందికి సమాచారమివ్వగా వారు పరిశీలించి అప్పటే మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాల్‌ మరణవార్తను మిజోరాంలోని అతడి కుటుంబసభ్యులకు చేరవేశారు.

Also Read: అర్థరాత్రి ఒంటరి యువతిపై కీచక పర్వం.. ఏలూరులో మరో దిశ కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.