యాప్నగరం

దళితుడు బిర్యానీ విక్రయిస్తున్నాడని దాడి.. దేశ రాజధానిలో పడగవిప్పిన కుల వివక్ష!

దేశ రాజధాని ఢిల్లీలో దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడికి తెగబడ్డారు. గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 15 Dec 2019, 5:48 pm
దేశ రాజధాని ఢిల్లీలో కుల వివక్ష పడగవిప్పింది. దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడికి తెగబడ్డారు. కులం పేరుతో దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu dalith


కొంత కాలంగా బెదిరింపులు
బిర్యానీ విక్రయిస్తున్న దళితుడైన లోకేష్‌ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు తీవ్రంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. దళితుడైనందున బిర్యానీ విక్రయించవద్దంటూ లోకేష్‌ను కొందరు పలుమార్లు హెచ్చరించారు. అయినా లోకేష్ బిర్యానీ విక్రయిస్తుండటంతో విచక్షణ మరిచిన దుండగులు దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read: షాకింగ్.. కులం పేరుతో దుర్భాషలాడుతూ మహిళపై దాడి! వీడియో వైరల్..

ఖండించిన నటి ఊర్మిళ
ఈ ఘటనను ఖండిస్తూ ప్రముఖ సినీ నటి ఊర్మిళా మటోండ్కర్‌ ట్వీట్‌ చేశారు. దీన్ని భయానకరమైన ఘటనగా అభివర్ణించారు. అంటరానితనం పాటించడం భారతీయ సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని స్పష్టం చేశారు. దళితుడిపై దాడి ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.