యాప్నగరం

భర్తకి పుట్టిన కూతురు భారం.. ప్రియుడితో కలసి తల్లి ఘాతుకం

బరితెగించిన భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. అప్పటికే ఉన్న కూతురిని వెంటబెట్టుకుని అతనితో సహజీవనం చేస్తోంది. తీరా వారిద్దరికీ బిడ్డ పుట్టడంతో..

Samayam Telugu 8 Sep 2020, 9:40 pm
ప్రియుడితో కలసి కన్నకూతురిని కిరాతకంగా హత్య చేసిందో కసాయి తల్లి. భర్త నుంచి విడిపోయిన మహిళకి ప్రియుడితో మరో కూతురు పుట్టింది. దీంతో భర్తకి పుట్టిన కూతురిని భారంగా భావించిన కిరాతకురాలు దారుణానికి ఒడిగట్టింది. అభం శుభం తెలియని చిన్నారిని అమానుషంగా చంపేసింది. ఈ కిరాతక ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
illegal affair


మైసూరు జిల్లాలోని శ్యాదనహళ్లికి చెందిన పవిత్ర(23)కి ఎనిమిదేళ్ల కిందట సిద్దేష్‌తో వివాహమైంది. రెండేళ్లకు కూతురు జయలక్ష్మి(6) పుట్టింది. కొద్దికాలం తర్వాత పవిత్రకి అదే ప్రాంతానికి చెందిన సూర్య(23)తో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిపోయిన పవిత్ర.. నాలుగేళ్ల కిందట భర్త నుంచి విడిపోయి ప్రియుడు సూర్యతో సహజీవనం చేస్తోంది.

Also Read: ప్రియుడి మోజులో భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య.. ఎటాక్ టైంలో సడెన్ ట్విస్ట్

ఈ క్రమంలో ఆమె మరో కూతురికి జన్మనిచ్చింది. దీంతో జయలక్ష్మిని భారంగా భావించిన కసాయి తల్లి ప్రియుడితో కలసి ఘాతుకానికి పాల్పడింది. నిద్రిస్తున్న చిన్నారికి దిండుతో అదిమి కిరాతకంగా చంపేసింది. ఆ విషయం తండ్రి సిద్దేష్‌కి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు పవిత్ర, సూర్యతో పాటు వారికి సహకరించిన ఆమె తల్లి గౌరమ్మని అరెస్టు చేశారు.

Read Also:
గే సెక్స్‌కి యువకుడి బలి.. ఆ రొమాన్స్ కోసం వెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.