యాప్నగరం

Vaishno Devi: వైష్ణోదేవికి భక్తులతో వెళ్తోన్న బస్సు బోల్తా.. 10 మంది మృతి.. 50 మందికి గాయాలు

Vaishno Devi జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది చనిపోగా.. మరో 50 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కాట్రాలోని వైష్ణోదేవి దర్శనం కోసం వీరంతా వెళ్తుండగా వంతెన వద్ద బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే, ట్రావెల్స్ బస్సు నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు చెబుతున్నారు. బస్సు కెపాసిటీకి మించి యాత్రికులను అందులో ఎక్కించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేపట్టారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 May 2023, 10:28 am

ప్రధానాంశాలు:

  • పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన బిహార్ యాత్రికులు
  • ప్రమాదవశాత్తూ శ్రీనగర్ హైవేపై బోల్తాపడిన బస్సు
  • క్షతగాత్రులకు జమ్మూ మెడికల్ కాలేజీలో చికిత్స
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జమ్మూ బస్సు ప్రమాదం
వైష్ణో దేవి దర్శనానికి భక్తులను తీసుకుని వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ వంతెన మీద నుంచి లోయలోపడి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో 55 మంది గాయపడ్డారు. అమృత్‌సర్ నుంచి యాత్రికులతో వస్తున్న బస్సు.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కొట్లీ సమీపంలోని వంతెన వద్ద అదుపుతప్పింది. అనంతరం వంతనపై నుంచి లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ముగ్గురు ఆస్పత్రిలో చనిపోయారు.
మరో 50 మందికిపైగా గాయపడిగా.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వైష్ణోదేవి ఆలయానికి 15 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపినట్టు జమ్మూ డీసీపీ అవ్నీ లావాసా తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం కోసం తరలించామని చెప్పారు.

ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులను బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. తీర్ధయాత్రల కోసం బిహార్ నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. అమృత్‌సర్ స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత వైష్ణోదేవి దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో సామర్ధ్యానికి మించి యాత్రికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Read More Latest Crime News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.