యాప్నగరం

ప్రకాశం జిల్లాలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. రాళ్లతో కొట్టి సజీవదహనం

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనా? లేక దొంగతనానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

Samayam Telugu 4 Dec 2019, 9:11 am
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సంతనూతలపాడు పట్టణంలో తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా చంపేశారు. బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడివున్నారు.
Samayam Telugu murdrgs


Also Read: ఫ్రెండ్‌తో కలిసి భార్యను రేప్ చేసి జననాంగాలపై వాతలు.. కదిరిలో దారుణం

వారిద్దరిని దుండుగులు రాళ్లతో కొట్టి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనేనా? లేక దొంగతనానికి వచ్చిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని.. భర్త పురుషాంగం కోసేసిన రెండో భార్య

ఈ దారుణ ఘటనలో సంతనూతలపాడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో ఈ ఘటన జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Also Read: తండ్రి కాదు కీచకుడు.. కన్నకూతురినే గొలుసులతో బంధించి అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.