యాప్నగరం

తాగుబోతు తల్లిని చంపేసిన కొడుకులు.. షాకింగ్

ఇద్దరు మైనర్ కొడుకులతో కలసి తల్లి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. మద్యానికి బానిసగా మారిన ఆమె నిత్యం తాగొచ్చి వేధింపులకు దిగేది.

Samayam Telugu 17 Sep 2020, 7:02 pm
కడుపున పుట్టిన కొడుకులే కన్నతల్లిని కిరాతకంగా చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. హత్యానంతరం గుర్తుతెలియని దుండగులు తమ తల్లిని చంపేశారంటూ హైడ్రామాకు తెరతీశారు. తీరా పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. నగరంలోని సుందరపాద ఏరియాకి చెందిన మహిళ తన ఇద్దరు మైనర్ కొడుకులతో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


మద్యానికి బానిసైన తల్లి నిత్యం తాగొచ్చి కొడుకులను ఇబ్బందులకు గురిచేసేది. తాగుబోతు తల్లి వేధింపులతో విసిగిపోయిన కొడుకులు కోపం పెంచుకున్నారు. బుధవారం రాత్రి కూడా ఫుల్లుగా తాగొచ్చిన తల్లి కొడుకులతో వాగ్వాదానికి దిగింది. పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడడంతో సహనం నశించిన కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. తల్లి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. తీవ్రరక్తస్రావమై ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Also Read: తమ్ముడి ముందే అక్కతో సరసాలు.. చివరికి..

అనంతరం తల్లి శవాన్ని బాత్రూమ్‌లో పడేసిన కొడుకులు హైడ్రామాకు తెరతీశారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ దగ్గరకు పరిగెత్తుకెళ్లి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి తల్లిని కొట్టి చంపారని చెప్పారు. వాచ్‌మెన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీలు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. కొడుకులపై అనుమానం వచ్చి తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు.

Read Also: చైనా మహిళకి నరకం.. జననాంగంలో పొడవాటి వస్తువు‌.! హింసించి సజీవ దహనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.